హైదరాబాద్లోని గోల్కొండ, ఆర్కేపురంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్, సూపర్వైజర్, ఎల్డిసి, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, హెల్త్ వెల్నెస్ టీచర్, డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కంప్యూటర్ నాలెడ్జ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయసు 35 నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆర్మీ పబ్లిక్ స్కూల్, హైదర్షా కోట్, 500031 చిరునామాకు అవసరమైన ధృవపత్రాలు పంపించాలి.దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి.
వెబ్సైట్ : www.apsgolkonda.edu.in
www.apsrkpuram.edu.in