ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో జాబ్ మేళాను ప్రకటించింది. ఈ నెల 31న నూజివీడులో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ జాబ్ మేళాలో మొత్తం 15 ప్రముఖ సంస్థల్లో వేయికి పైగా ఖాళీలకు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళాలో Byjus, KIA, Axis, Amara Raja, Apollo, Hero Moto Corp, Navatha Road Transport తదితర సంస్థలో పాల్గొని తమ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
Byjus: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. పీజీ చేసిన వారు అర్హులు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.66 వేల వరకు వేతనం ఉంటుంది. పురుషులు/స్త్రీలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.
Axis Bank: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
Amara Raja Group: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Apollo Pharmacy: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
KIA Motors: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
Muthoot Finance: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్&ఇంటర్న్షిప్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ లింక్:
అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 31న ఉదయం 9 గంటలకు SRR Boys ZP High School, Nuzvidu, Eluru నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 8374039719, 9440042901 నంబర్లను సంప్రదించాలని సూచించారు.