యూపీఎస్సీ ఇండియన్ ఎకనమిక్ సర్వీసెస్(ఐఈఎస్) ఎగ్జామినేషన్-2020 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆగస్టు 11 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా ప్రకటించింది. ఐఈఎస్ పరీక్షను అక్టోబర్లో నిర్వహిస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. జూన్ 10న ఐఈఎస్, ఐఎస్ఎస్ (ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఐఈఎస్ పోస్టులు ఖాళీగా లేవని, ఈ ఏడాది పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కోరిక మేరకు ఇప్పుడు ఐఈఎస్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 18 వరకు ఈ పరీక్ష నిర్వహించనుంది. గతంలో మాదిరిగానే ఐఈఎస్, ఐఎస్ఎస్ పరీక్షలను ఒకేసారి నిర్వహించనుంది.
అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://www.upsc.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
- ఇండియన్ ఎకనమిక్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(ఐఈఎస్) – 2020
- అర్హత: ఎకనమిక్స్/ అప్లయిడ్ ఎకనమిక్స్/ బిజినెస్ ఎకనమిక్స్/ ఎకనామెట్రిక్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
- వయసు: ఆగస్టు 1, 2020 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా ఆధారంగా.
- పరీక్ష తేది: అక్టోబరు16 నుంచి అక్టోబర్ 18 వరకు.
- అప్లికేషన్లకు తుది గడువు; సెప్టెంబర్ 01, 2020, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
- అప్లై ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు)
- వెబ్సైట్:https://www.upsc.gov.in/
యూపీఎస్సీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు