HomeJOBS10,277 ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్ !

10,277 ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్ !

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 10,277 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటింగ్, అప్లికేషన్స్‌పై అవగాహన ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
కస్టమర్ సర్వీస్ అసోసియేటర్ పోస్టులు – 10,277
రాష్ట్రాల వారిగా పోస్టులు:
ఏపీ- 367
తెలంగాణ- 261

అర్హతలు:
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం: అభ్యర్థులు కంప్యూటర్ ఆపరేటింగ్, అప్లికేషన్స్‌పై అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్థులు డిప్లొమా, డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పాఠశాల లేదా కాలేజీ స్థాయిలో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వారికి కూడా ఈ పోస్టులకు అర్హులు.

స్థానిక భాషా పరిజ్ఞానం: అభ్యర్థులు ఏ రాష్ట్రంలో అప్లై చేసుకుంటున్నారో.. ఆ రాష్ట్రం యొక్క స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. 10వ తరగతి లేదా ఆ పై స్థాయిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివిన వారికి భాషా నైపుణ్య పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతా అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష తర్వాత భాషా పరిజ్ఞాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్టు 21 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబర్‌లో అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ అందిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష: నవంబర్ 29వ తేదీన ఈ పోస్టులకు సంబంధించి మెయిన్స్ నిర్వహించారు.

వయస్సు: ఆగస్టు 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యుడీ అభ్యర్థులకు రూ.175 ఉంటుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షల ద్వారా జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష: ఇది ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.

మెయిన్స్ పరీక్ష: మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

అప్లై చేసుకునే విధానం:
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన అన్ని వివరాలు, ఫొటోగ్రాఫ్, సంతకం, చేతిరాత డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here