హర్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ విడుదలైంది. సిద్ధిపేట జిల్లాలోని ములుగు సమీపంలో కొండా లక్ష్మణ్ బాపూజీ హర్టికల్చర్ యూనివర్సిటీ లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. టెన్త్, ఇంటర్, ఆపైన చదివిన వారందరూ ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. 15 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సున్న వారికే అడ్మిషన్లు ఇస్తారు. ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు.
దరఖాస్తుకు చివరితేదీ డిసెంబర్ 13.
వెబ్సైట్ : www.dme.telangana.gov.in
ఉస్మానియాలో ఎంబీఏలో చేరాలంటే లాస్ట్ ఛాన్స్
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ కోర్సులో చేరాలనుకుంటే.. డోంట్ మిస్.
ఇప్పటికే ముగిసిన ఈ అడ్మిషన్లకు యూనివర్సిటీ మరోసారి గడువు పొడిగించింది. డిగ్రీ పాసైన అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 17వ తేదీలోగా తమ దరఖాస్తులను నేరుగా యూనివర్సిటీ ఆఫీసులో సమర్పించాలని డైరెక్టర్ పాండురంగారెడ్డి ప్రకటించారు. వీరికి డిసెంబర్ 18న పరీక్ష నిర్వహిస్తారు.
పీజీ ఎంట్రన్స్ ఫస్ట్ లిస్ట్ నేడే
తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు సంబంధించిన సీట్ల తొలి జాబితా విడుదలైంది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఈ సీట్లు అలాట్ చేశారు. మొదటి విడత జాబితాను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్ పాండురంగారెడ్డి ప్రకటించారు.
నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు
నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్లకు చివరి తేదీ డిసెంబర్ 15.
వెబ్సైట్ :http://knruhs.telangana.gov.in
తెలంగాణాలోని ప్రైవేటు, గవర్నమెంట్ నర్సింగ్ స్కూళ్లలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్ కోర్సుల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. డిసెంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే గడువుంది.
…..
సివిల్స్ ఫ్రీ కోచింగ్ ఎంట్రన్స్ 11న
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 11న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి తెలిపారు. దాదాపు 3064 మంది అభ్యర్థులు ఈ కోచింగ్ కు అప్లై చేసుకున్నారు. డిసెంబర్ 11న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు రెండు విడతల్లో ఈ పరీక్ష ఉంటుంది.
…….