తెలంగాణ టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మార్చి14 వరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపటొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రాత్రికి అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది. టెన్త్ పరీక్షల తర్వాతే మళ్లీ బదిలీలకు ఛాన్స్ ఇచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్పౌజ్ టీచర్లకు పది అదనపు పాయింట్లను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, నాన్ స్పౌజ్ టీచర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలపై మార్చి14 వరకూ ఎలాంటి ప్రక్రియ చేపట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3–12 వరకూ టెన్త్ పరీక్షలు ఉన్నాయి. టెన్త్ వాల్యువేషన్ రెండు వారాలు ఉంటుంది. దీంతో ఆ తర్వాతే బదిలీల ప్రక్రియ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు సూచనాప్రాయంగా నిర్ణయించారు.