HomeLATESTగ్రూప్​ 1 నోటిఫికేషన్ రెడీ​.. ఆగస్టు చివర్లో ప్రిలిమ్స్​

గ్రూప్​ 1 నోటిఫికేషన్ రెడీ​.. ఆగస్టు చివర్లో ప్రిలిమ్స్​

గ్రూప్ 1 నోటిఫికేషన్​ పై టీఎస్​పీఎస్​సీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 26 లేదా 27న నోటిఫికేషన్​ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 503 గ్రూప్1 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ కూడా రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ కోసం టీఎస్​పీఎస్​సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం టీఎస్పీఎస్​సీ పూర్తి స్థాయి కమిటీ మీటింగ్​ జరిగింది. ఇందులో నోటిఫికేషన్​, అప్లికేషన్ల వ్యవధి.. ఎగ్జామ్​ షెడ్యూలుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. గ్రూప్​ 1 పోస్టులను స్టేట్​ కేడర్​ పోస్టులుగా కాకుండా.. మల్టీ జోన్​ పోస్టులుగానే పరిగణించి.. అదే తీరుగా రిక్రూట్​మెంట్​ చేపట్టాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈనెల 26 తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్​ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. అప్లై చేసుకునేందుకు నెల రోజులు టైమ్​ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ప్రిపరేషన్​కు తగినంత గడువు ఇచ్చి ఆగస్టు చివరన.. లేదా సెప్టెంబర్​ మొదటివారంలో ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ నిర్వహించేందుకు వీలుగా ఎగ్జామ్​ షెడ్యూల్​పై చర్చ జరిగినట్లు టీఎస్పీఎస్సీ​వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!