Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 1 ఫలితాలకు హైకోర్టు మెలిక

గ్రూప్​ 1 ఫలితాలకు హైకోర్టు మెలిక

గ్రూప్​ వన్ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై.. కోర్టు తుది ఉత్తర్వులకు అనుగుణంగా గ్రూప్‌–1 ఫలితాలు విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన కేసులో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌ వన్‌ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే రిట్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 30న జారీ చేసిన జీవో 33 ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి పది శాతానికి పెరిగాయి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అందులో స్పష్టం చేసింది. కానీ.. అప్పటికే గ్రూప్​ వన్​ నోటిఫికేషన్​ వెలువడింది. గ్రూప్‌ వన్‌ పోస్టుల నోటిఫికేషన్‌లో రోస్టర్‌ పాయింట్లను ప్రకటించకపోవడం వల్ల పెంచిన రిజర్వేషన్లు తమకు అమలు కావడం లేదని హైకోర్టులో రిట్​ దాఖలైంది.

రోస్టర్‌ పాయింట్లు ప్రకటించాలంటూ మెదక్‌ జిల్లా సర్ధనా హవేలీ ఘన్‌పూర్‌ పోచమ్మరాల్‌ తండాకు చెందిన జి. స్వప్నతో పాటు అయిదుగురు అభ్యర్థులు హైకోర్టులో ఈ రిట్​ దాఖలు చేశారు. అడ్వకేట్​ రచనారెడ్డి ఈ రిట్​ను వాదించారు. 503 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆరు శాతం పాత రిజర్వేషన్ల ప్రకారం దాదాపు 32 పోస్టులే ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. రోస్టర్‌ పాయింట్లను వెల్లడిస్తే ఆ పోస్టుల సంఖ్య 50కి పెరుగుతుందని కోర్టులో తమ వాదన వినిపించారు. ఈ జీవోను గ్రూప్​ వన్​ నోటిఫికేషన్‌కు వర్తింపజేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు పరీక్షను యథాతథంగా నిర్వహించుకోవచ్చని టీఎస్​పీఎస్​సీకి సూచించింది. తదుపరి తీర్పుకు లోబడి గ్రూప్‌ వన్‌ పరీక్షల ఫలితాలు ఉంటాయని తెలిపింది. కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!