Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 1 ఎగ్జామ్​ లో ప్రశ్నాపత్రం తారుమారైందా.. ఆ సెంటర్​లో ఏం జరిగింది..

గ్రూప్​ 1 ఎగ్జామ్​ లో ప్రశ్నాపత్రం తారుమారైందా.. ఆ సెంటర్​లో ఏం జరిగింది..

టీఎస్​పీఎస్​సీ ఈ నెల 16న నిర్వహించిన గ్రూప్​ 1 ఎగ్జామ్​లోనూ పొరపాట్లు జరిగాయా.. ? టీఎస్​పీఎస్​సీ వర్గాల్లోనే ఇది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్​ జిల్లాలోని ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్ లో గ్రూప్​ 1 పేపర్​ ఆలస్యంగా నిర్వహించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సెంటర్​లోని మూడు రూమ్​ల్లో మూడు రూముల్లో ఇంగ్లీష్-తెలుగు పేపర్ కు బదులు.. ఇంగ్లీష్ -హిందీ పేపర్ ఇవ్వటంతో అభ్యర్థులు బిత్తరపోయారు. ఏకంగా సెంటర్​లోనే ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు సముదాయించినా అభ్యర్థులు తమ ఆందోళన విరమించలేదని తెలిసింది.

Advertisement

అప్పటికే దాదాపు గంట సేపు పరీక్ష టైమ్​ ముగియటంతో.. వారికి కొత్త పేపర్​.. కొత్త ఓఎంఆర్​ షీట్​ ఇచ్చి.. అదనపు టైమ్​ ఇచ్చి పరీక్ష రాయించినట్లు ఆలస్యంగా బయటపడింది. అభ్యర్థులు సెంటర్​ బయటకు వెళ్లలేదని, సెంటర్​ లోపలే ఉన్నారని.. అందుకే ఈ విషయాన్ని టీఎస్​పీఎస్​సీ అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీఎస్​పీఎస్​సీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!