ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో సివిల్స్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
గ్రూప్-1 పోస్టుల భర్తీకి జనవరి 8నప్రిలిమినరీ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. అనంతరం కేవలం 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజరు కాగా.. ఇందులో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు.