రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేసీఆర్ శుభవార్త చెప్పాడు. వనపర్తి జిల్లా నాగవరంలో ఏర్పాటు మంగళవారం చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ వేదికగా ఉదయం 10 గంటలకు ఓ ప్రకటన చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కావున నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని పిలుపునిచ్చారు. దీంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లపై లేక నిరుద్యోగ భృతిపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, సోమవారం ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో రూ.3500 కోట్లను రాబోయే ఉద్యోగుల జీతభత్యాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు రేపు 10 గంటలకు గుడ్న్యూస్ చెప్తా : సీఎం కేసీఆర్
Advertisement