ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్– 2021 ఆన్లైన్ అప్లికేషన్ల గడువును ప్రభుత్వం జూన్ 3 వరకు పొడిగించింది. ఈనెల 26 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకునే అవకాశముండేది. గడువు ముగియడంతో స్టూడెంట్ల అభ్యర్థన మేరకు మరోవారం గడువు పొడగించినట్టు టీఎస్ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంసెట్ అప్లికేషన్లు రెండు లక్షలు దాటాయి. ఇప్పటివరకు 2.02 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీటిలో 1,36 లక్షలు ఇంజినీరింగ్ కాగాచ 66 వేలకు పైగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ అప్లికేషన్లు ఉన్నాయి.
ఎంసెట్ దరఖాస్తు గడువు జూన్ 3 వరకు పెంపు
Advertisement