ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB).. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. డిసెంబర్ 17 నుంచి అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 15 వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు- ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB)
పోస్ట్ పేరు- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)
మొత్తం ఖాళీల సంఖ్య- 714
విభాగాల వారిగా పోస్టులు:
మల్టీ-టాస్కింగ్ స్టాప్ లేబర్ డిపార్ట్మెంట్- 93
డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్- 98
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్- 99
డెవలప్మెంట్ డిపార్ట్మెంట్- 123
డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్- 06
రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్- 23
ఫుడ్, సప్లైస్ & కన్స్యూమర్ అఫైర్స్-140
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ/సంస్థ నుంచి తప్పనిసరిగా టెన్త్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ. ఇతర ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)
జీతం: అభ్యర్థులకు రూ. 18,000 – 56,900 (పే లెవల్-1 ప్రకారం) జీతం లభిస్తుంది.
అప్లికేషన్ ప్రారంభ తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: జనవరి 15,2026 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, SC, ST, PwBD, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ విధానం:
అధికారిక వెబ్ సైట్ https://dsssb.delhi.gov.in/ ద్వారా మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.





