డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) పస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 24 వరకు పొడగించింది. ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఈ నెల 31న ఉంటుందని దోస్త్ ఛైర్మన్ నవీన్ మిట్టల్ ప్రకటన విడుదల చేశారు. కొత్త షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1 నుంచి 5 వరకు సీట్ల పొందిన స్టూడెంట్లు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ రిజిస్టేషన్లు ఆగస్టు 1 నుంచి 9 వరకు, ఆనెల 2వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చింది. ఆగస్టు 14న సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికే 1.50 లక్షల మంది దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఎడ్ సెట్ దరఖాస్తు గడువు 22 వరకు పెంపు
బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న ఎడ్ సెట్ దరఖాస్తు గడువును ఈనెల 22 వరకు పొడగించినట్టు ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ ప్రకటించారు. కోవిడ్ తీవ్రత కారణంగా చాలా మంది అప్లై చేసుకోకపోవటంతో.. ఈ గడువు పొడిగించారు.
పీఈసెట్ దరఖాస్తు గడువు 31వరకు పెంపు
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఈనెల31 వరకు గడువు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు.