తెలంగాణా లోని డిగ్రీ కళాశాలలలో 2020-21 అడ్మిషన్లకు రివైజ్డ్ డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్, తెలంగాణా(దోస్త్ )నోటిఫికేషన్ ని ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణా, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధి లోని సుమారు 1000 ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలల లోని సీట్లని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.పూర్తి వివరాలకి దోస్త్ వెబ్ సైట్ చూడవచ్చు.
తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 24 వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
మొదటి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 16 వ తేదీన జరుగుతుంది.
పూర్తి వివరాల ప్రెస్ నోట్