హైదరాబాద్లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెలాఖరు వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది.
ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుండి రెండేళ్లపాటు డ్యూటీలో కొనసాగుతారు.
ప్రస్తుతం పని చేస్తున్న స్ట్రింగర్లు కూడా,ఈ కొత్త ఎంపానెల్మెంట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు తమ దరఖాస్తులను 30.09.2021 సాయంత్రం 5 గంటలలోపు హైదరాబాద్ రామాంతపూర్ లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చు.
స్ట్రింగర్ల ఎంపిక విద్యార్హతలు, అనుభవం, ఎంపిక విధానం తో పాటు పుర్తి వివరాలు ప్రసార భారతి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పీడీఎప్లో పూర్తి వివరాలున్నాయి.
prasarbharati.gov.in/pbvacancies/