హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మోడరన్ తెలుగు, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, డిప్లొమా ఇన్ జ్యోతిష్యం, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జ్యోతిష్యం, సంగీత విశారద, డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ కోర్సుల్లో చేరడానికి ఆయా రంగాలపై ఆసక్తి ఉండి కోర్సును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి దచేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కోర్సు నిర్ధేశించిన వ్యవధికి రెట్టింపు సమయంలోగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
తెలుగు యూనివర్సిటీ పరిధిలో బొమ్మూరు, శ్రీశైలం, కూచిపూడి, వరంగల్ లో ఉన్న ప్రాంతీయ కేంద్రాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఆన్లైన్ లేదా పోస్టు ద్వారా అప్లై చేసుకునేందుకు చివరితేదీ జనవరి 31.
వెబ్సైట్ : www.teluguuniversity.ac.in
పూర్తి వివరాలున్న ప్రాస్పెక్టస్.. ..