తెలంగాణ
చెరువుల రక్షణకు టోల్ఫ్రీ
హైదరాబాద్లోని పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1800599099 ను ప్రారంభించింది. ఫిర్యాదు చేసిన వ్యక్తికి విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఆ నంబర్తో ఆన్లైన్ ద్వారా విచారణ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాటు చేశారు.
రాయల్ టైగర్ మృతి
హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో జులై 4న 11 ఏళ్ల రాయల్ టైగర్ ‘కదంబ’ మృతి చెందింది. 2014 లో కర్ణాటకలోని మంగళూర్ లో గల బయాలజికల్ పార్కు నుంచి జంతు మార్పిడిలో భాగంగా తీసుకొచ్చారు. నెల వ్యవధిలోనే కదంబతో పాటు వృద్ధ్యాప్యం కారణంగా రోజా, సోని, కిరణ్ అనే పులులు మృతిచెందాయి. ప్రస్తుతం జూలో 11 రాయల్ టైగర్స్ ఉన్నాయి. 2018లో పులుల గణన ప్రకారం దేశంలో 2,967 పులులు ఉండగా అత్యధికంగా మధ్యప్రదేశ్లో 526 ఉన్నాయి.
సైబర్ ప్రోగ్రాం
సైబర్ నేరాలపై ఆన్లైన్లో అవగాహన కల్పించేందుకు సింబయాసిస్ లా స్కూల్, తెలంగాణా పోలీసు మహిళారక్షణ విభాగంతో కలిసి తెలంగాణ ప్రభుత్వం సైబర్( CYBHER) ప్రోగ్రాం ప్రారంభించింది. దీనికి సైబర్ ఎక్స్పర్ట్ రక్షితా టాండన్ నేతృత్వం వహిస్తున్నారు.