HomeLATESTసీబీఎస్​ఈ ఎగ్జామ్స్​ పాత మోడల్​లోనే..

సీబీఎస్​ఈ ఎగ్జామ్స్​ పాత మోడల్​లోనే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్​ (CBSE) బోర్డు పరీక్షల్లో కీలక మార్పుల్ని ప్రకటించింది. మళ్లీ యాన్యువల్ ఎగ్జామ్ పద్ధతికి మారుతున్నట్టు ప్రకటించింది. కరోనా కారణంగా 2021–2022 బ్యాచ్ విద్యార్థులకు రెండు టర్మ్​లుగా పరీక్షలు నిర్వహించింది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టర్మ్ 1 పరీక్షలు ముగిశాయి. టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి. ఈ బ్యాచ్ విద్యార్థులకు మాత్రమే రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయని.. వచ్చే బ్యాచ్​కు యథాతథంగా యాన్యువల్​ పరీక్షలు ఒకటేసారి ఉంటాయని ప్రకటించింది. కరోనా తగ్గిపోవటంతో రెండు టర్మ్‌ల పరీక్షల విధానాన్ని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌లో కూడా సీబీఎస్​ఈ బోర్డు పలు మార్పులు చేసింది. గత ఏడాది కరోనా ఎఫెక్ట్ తో 30 శాతం సిలబస్​ను సీబీఎస్​ఈ తగ్గించింది. దాని ప్రకారమే పరీక్షల్ని నిర్వహించింది. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి తిరిగి పాత సిలబస్ ప్రకారమే పరీక్షల్ని నిర్వహించనుంది. కొన్ని చాప్టర్స్‌లో మాత్రమే మార్పులు చేసినట్లు ప్రకటించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!