HomeLATESTసీబీఎస్​ఐ టెన్త్ ఎగ్జామ్స్​ రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్​ఐ టెన్త్ ఎగ్జామ్స్​ రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా


కరోనా సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్ తో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తితో పాటు పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రమేష్​ పోఖ్రియాల్​ ప్రకటించారు.

బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తారు. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తదుపరి తేదీలపై నిర్ణయం తీసుకుంటారు. పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్వర్యంలో జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

మహారాష్ట్ర,చత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే బోర్డ్ పరీక్షలని వాయిదా వేసాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 10,12 తరగతుల పరీక్షలు మే 4 వ తేదీ నుంచి జూన్ 14 వ తేదీ వరకు జరగాల్సి ఉంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!