దేశం లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్(ఐ ఐ ఎం),ఇతర మేనేజిమెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్-2020 నోటిఫికేషన్ వెలువడింది. ఐ ఐ ఎం ఇండోర్ ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఆగస్ట్ 5 వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 16 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అక్టోబర్ 28 వ తేదీ నుంచి వెబ్ సైట్ లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.
నవంబర్ 29 వ తేదీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు సెషన్ ల లో జరుగుతుంది.దేశ వ్యాప్తం గా సుమారు 156 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూడవచ్చు.