ఆర్జీయూకేటీ పరిధిలోని బాసర ట్రీపుల్ఐటీలో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేండ్ల ఇంటిగ్రేటేడ్ బీటెక్ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నేటి నుంచి జులై 15 వరకు ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ. 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 150 చెల్లించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుతో పాటు సర్వీసు చార్జీ అధనంగా రూ. 25 చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, టెన్త్ హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్యా నిర్ధారణ సర్టిఫికేట్, సైనికోద్యోగుల పిల్లలైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ www.rguket.ac.in జులై 30న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్..
టెన్త్ లో వచ్చిన జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల జీపీఏలు ఒక్కటైతే వరుసగా గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్లో ఎక్కువగా గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు వివరాలు
రాష్ట్ర పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఏడాదికి రూ. 36వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయంబర్స్మెంట్ అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500 చొప్పున చెల్లించాలి. క్యాష్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజిట్ కిందే కేటగిరి అభ్యర్థులైన వారు రూ. 2వేలు చెల్లించాలి. ఇతర రాష్ట్రాలు, గల్ప్ దేశాల్లో పని చేసే వారి పిల్లలు ఏడాదికి రూ. 1.36లక్షలు, ఎన్నారై విద్యార్థులకు రూ. 3లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
I want to make my future bright
For my studies this the best place for education
I want to make my future bright
I want to study well
This the best education for my studies