ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 5 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది సెంట్రల్ బ్యాంక్. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ యొక్క వివిధ శాఖలు/కార్యాలయాల్లో అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల.. అంటే మార్చి 20న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.centralbankofindia.co.in/ వెబ్సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 2వ వారంలో అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం అప్రెంటీస్ల నియామకాలు జరుగుతున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
మొత్తం 5 వేల ఖాళీల్లో ఏపీలో 141, తెలంగాణలో 106 ఖాళీలు ఉన్నాయి.
వేతనం:
గ్రామీణ/సెమీ-అర్బన్ శాఖల్లో – రూ. 10,000
పట్టణ శాఖలు-రూ. 15,000
మెట్రో శాఖలు – రూ. 20,000