అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ – పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ, ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. మూడేళ్ల అనుభవం ఉన్నవారికి 50 శాతం ఫీజు రాయితీ లభిస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూలు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండేళ్ల ప్రోగ్రామ్లో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.
ఎంఏ ప్రోగ్రామ్లో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఏ ఎకనామిక్స్ ప్రోగ్రామ్కు ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ, మిగిలిన వాటికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎల్ఎల్ఎంలో లా అండ్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఎల్ఎల్ఎంకు మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 28 చివరితేది. ఎంట్రెన్స్ మార్చి 13న ఉంటుంది.
వెబ్సైట్ : www.azimpremjiuniversity.edu.in