బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అడ్మిషన్లకు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్ ‘నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా). ప్రతి ఏడాది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏటా రెండు సార్లు ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా ఈ ఏడాది తొలి విడత జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్టు 28న నాటా-2020 ఎగ్జామ్ నిర్వహించేందుకు షెడ్యూలు ప్రకటించింది.
కోర్సు; బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)
కోర్సు వ్యవధి; అయిదేళ్లు.
అర్హత; మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 50% మార్కులు, మొత్తం కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాసైన విద్యార్థులందరూ అర్హులు.
పరీక్ష విధానం; 200 మార్కులకు ఈ ఎంట్రన్స్ ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి రెండు భాగాలు ఉంటాయి. పార్ట్-ఎ డ్రాయింగ్పై, పార్ట్-బిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలుంటాయి.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: ఆగస్టు 12
తొలి విడత పరీక్ష తేదీ: ఆగస్టు 29.
పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 10 నుంచి 12, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు
మొదటిసారిగా ఈ ఏడాది నాటాలో డ్రాయింగ్ టెస్ట్ కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగా సిలబస్ మార్చారు. గతంలో డ్రాయింగ్ టెస్ట్ అభ్యర్థి స్కిల్స్ ను పరీక్షించేదిగా ఉండేది. దాన్ని ఇప్పుడు అవగాహన పరీక్షించేదిగా మార్పు చేశారు. అభ్యర్థి కంప్యూటర్ ముందు కూర్చొని సమాధానాలు ఇస్తే సరిపోతుంది.
అభ్యర్థులు ఈసారి ఎంట్రన్స్ను ఇంటి నుంచే రాసేందుకు వెసులుబాటు కల్పించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, పర్సనల్ కంప్యూటర్, ల్యాప్ టాప్, వెబ్ క్యామ్ వంటి టెక్నికల్/హార్డ్ వేర్ సదుపాయం లేని వాళ్లు కౌన్సిల్ కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ నుంచి పరీక్ష రాసే వీలుంది.
పూర్తి వివరాలకు
http://www.nata.in/
పూర్తి వివరాలు ఈ పీడీఎఫ్ లో ఉన్నాయి. డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.