ఆంధ్రప్రదేశ్ లో సివిల్, ఏపీఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాల (AP Police Jobs) భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 6100 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 34 పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు.
91 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆన్సర్ కీని సైతం అధికారులు విడుదల చేశారు. https://slprb.ap.gov.in/ వెబ్ సైట్లో కీని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు mail-slprb@ap.gov.in కు మెయిల్ చేయాలని డీజీపీ కార్యాలయం సూచించింది. రెండు వారాల్లో ఇందుకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.