డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) కోర్సుల తోపాటు పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ప్రకటించింది.
విద్యార్హతలేవీ లేకున్నా18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరూ అర్హత పరీక్ష రాసి.. నేరుగా ఇందులో డిగ్రీ చదివే అవకాశముంది. మిగతా యూనివర్సిటీల డిగ్రీల తరహాలోనే ఈ డిగ్రీ చెల్లుబాటు అవుతుంది. ఆ పై ఉన్నత చదువులు కూడా చదువుకునే అవకాశముంటుంది.
కోవిడ్ ఎఫెక్ట్ తో ఈ ఏడాది ఏప్రిల్లో జరగాల్సిన ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా పడింది.
- ఈ అర్హత పరీక్షకు అప్లై చేసుకునేందుకు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగించింది.
- అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే వీలుంది.
- ఎంట్రన్స్ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు.
ఇప్పటికే అర్హత పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ ఏడాది కోర్సుల్లో జాయిన్ అయ్యేందుకు నోటిఫికేషన్ కూడా వెలువడింది. 2016 నుంచి 2019 వరకు ఎలిజిబులిటీ టెస్ట్ పాసైన అభ్యర్థులు.. ఇప్పుడు యూజీ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునే వీలుంది. వీరందరూ సెప్టెంబర్ 10లోగా ఆన్లైన్ ద్వారానే తమ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.
పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. https://braou.ac.in/ https://www.braouonline.in/