కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్..పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. జూన్ 29వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
మేనేజ్ మెంట్ ట్రైన్ ఇ 2 గ్రేడ్ 42 పోస్టులు
మేనేజ్ మెంట్ ట్రైనీ ఇ2గ్రేడ్ 7 పోస్టులు
నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైన్, టీ అండ్ ఎస్ గ్రేడ్ సి 100 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ టి అండ్ ఎస్ గ్రేడ్ సి 09పోస్టులు
అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ టి అండ్ గ్రేడ్ సి 24 పోస్టులు
ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ 47 పోస్టులు
ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 98 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య 327
అర్హతలు:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు :
18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు 5ఏండ్ల వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రిక్రూట్ మెట్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు:
రూ. 1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు 15.5.2024వ తేదీలోపు సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 29.06.2024