ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐడీబీఐ బ్యాంక్ మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (9 నెలలు క్లాస్ రూం + 3 నెలలు ఇంటర్నషిప్) పాటు పీజీ డిప్లొమా (పీజీడీబీఎఫ్)లో ట్రెయినింగ్ ఇచ్చి ఈ కోర్సు విజయవంతగా పూర్తి చేసుకున్నవారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇస్తారు. మొత్తం 1544 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 17వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1044, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 500 ఉన్నాయి.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్/ లాంగ్వేజ్లో డిప్లొమా/ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పత్రి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జులై 9, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు జులై 23న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.idbibank.in వెబ్సైట్లో సంప్రదించాలి.